విశాఖ ఎంపీగా గెలుపొందిన శ్రీభరత్‌కు చంద్రబాబు, బాలయ్య అభినందన

  • విశాఖ నుంచి ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందిన శ్రీభరత్
  • వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ చిత్తు
  • ఎన్నికల్లో పోటీచేసిన నందమూరి, నారా కుటుంబ సభ్యులు అందరూ గెలుపు
విశాఖపట్టణంలో వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మిపై 5 లక్షలకుపైగా ఓట్లతో విజయం సాధించిన శ్రీభరత్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు ఆయనను అభినందించారు.

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన శ్రీభరత్‌ను చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్, బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ తదితరులు అభినందించారు. ఈ ఎన్నికల్లో పోటీచేసిన నందమూరి, నారా కుటుంబ సభ్యులు అందరూ గెలవడం విశేషం. దీంతో అందరూ ఒక దగ్గరికి చేరుకుని సంబరాల్లో మునిగిపోయారు. కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో నారా లోకేశ్, హిందూపురంలో బాలకృష్ణ అసెంబ్లీకి ఎన్నికవగా, శ్రీభరత్ విశాఖ ఎంపీగా విజయం అందుకున్నారు.

Shri Bharat
Visakhapatnam
Telugudesam
Vishakha MP

More Telugu News